Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పెరిగిపోతున్న అకృత్యాలు.. కడపలో వివాహితపై సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (15:25 IST)
దేశంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నగర శివారుల్లోని ఇందిరానగర్ దగ్గర వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇందిరానగర్‌కు చెందిన ఓ మహిళ కడప రిమ్స్ ఆస్పత్రికి వెళ్ళి తిరిగి వస్తుండగా అటకాయించి కొండల్లోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశారు. 
 
నలుగురు యువకులు మహిళను దౌర్జన్యంగా లాక్కెళ్ళి ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు చెప్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. పోలీసుల అదుపులో నిందితులున్నట్లు సమాచారం.  
 
ఇటీవల సంక్రాంతి పండుగ నాడు ఏపీలోని మరో జిల్లాలో దారుణం జరిగింది. ఒంటరిగా వెళ్తున్న మహిళపై కన్నేసిన యువకులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. రాత్రివేళ లిఫ్ట్ ఇస్తామని బాధితురాలిని నమ్మించిన ఆ దుర్మార్గులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments