Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో దారుణం.. మహిళను బంధించి అత్యాచారం

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (09:55 IST)
విజయవాడ నగరంలో దారుణం జరిగింది. ఓ మహిళను తీసుకెళ్లిన ఓ గదిలో బంధించి మూడు రోజుల పాటు నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని బెంజి సర్కిల్ వద్ద కూలి పనులు చేసుకునే ఓ మహిళను అదే ప్రాంతంలోని సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేసే ఓ వ్యక్తి ఈ నెల 17వ తేదీన సనత్ నగర్‌లోని తన గదికి తీసుకెళ్లాడు.
 
అక్కడ ఆమెను గదిలో బంధించిన అతనితో పాటు మరో ముగ్గురు కలిసి మూడు రోజుల పాటు అత్యాచారం చేశారు. దీంతో ఆ మహిళ తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. తనపై జరిగిన అత్యాచారాన్ని వైద్యులకు బాధితురాలు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యులు ఇచ్చిన సమాచారం మేరకు పెనమలూరు పోలీసులు బాధితురాలితో మాట్లాడి కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments