Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్ నుంచి మహిళ మిస్సింగ్ - మచిలీపట్నంలో టెన్షన్.. టెన్షన్

Webdunia
ఆదివారం, 3 మే 2020 (09:48 IST)
ఆధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ తారా స్థాయిలో ఉంది. ఫలితంగా ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం కూడా కొత్తగా 60 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 1525కు చేరింది. అయితే, ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న జిల్లాల్లో కృష్ణా జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాల్లో ప్రధాన ప్రాంతాలైన విజయవాడ, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరస్ బారినపడినవారికి రక్షించేందుకు ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో క్వారంటైన్‌ను ఏర్పాటు చేసింది. 
 
అయితే, మచిలీపట్నంలోని చిలకలపూడిలో ఏర్పాటు చేసిన ఓ క్వారంటైన్‌లో ఉంచిన ఓ మహిళ సిబ్బంది, అధికారుల కన్నుగప్పి పారిపోయింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, మిస్సింగ్ అయిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
చిలకలపూడి క్వారంటైన్ నుంచి మహిళ మిస్సింగ్ అయిందన్న వార్త మీడియాలో ప్రసారం కావడంతో స్థానికుల్లో ఆందోళనమొదలైంది. ఆ మహిళ ఆచూకీ తెలుసుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరోవైపు, కరోనా వైరస్ కట్టడి కోసం ఏపీ సర్కారు ముమ్మరంగా ప్రయత్నం చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments