క్వారంటైన్ నుంచి మహిళ మిస్సింగ్ - మచిలీపట్నంలో టెన్షన్.. టెన్షన్

Webdunia
ఆదివారం, 3 మే 2020 (09:48 IST)
ఆధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ తారా స్థాయిలో ఉంది. ఫలితంగా ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం కూడా కొత్తగా 60 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 1525కు చేరింది. అయితే, ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న జిల్లాల్లో కృష్ణా జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాల్లో ప్రధాన ప్రాంతాలైన విజయవాడ, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరస్ బారినపడినవారికి రక్షించేందుకు ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో క్వారంటైన్‌ను ఏర్పాటు చేసింది. 
 
అయితే, మచిలీపట్నంలోని చిలకలపూడిలో ఏర్పాటు చేసిన ఓ క్వారంటైన్‌లో ఉంచిన ఓ మహిళ సిబ్బంది, అధికారుల కన్నుగప్పి పారిపోయింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, మిస్సింగ్ అయిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
చిలకలపూడి క్వారంటైన్ నుంచి మహిళ మిస్సింగ్ అయిందన్న వార్త మీడియాలో ప్రసారం కావడంతో స్థానికుల్లో ఆందోళనమొదలైంది. ఆ మహిళ ఆచూకీ తెలుసుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరోవైపు, కరోనా వైరస్ కట్టడి కోసం ఏపీ సర్కారు ముమ్మరంగా ప్రయత్నం చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Samyukta: ప్రాక్టీస్ తర్వాత మోకాలు నొప్పి తో ఫిజియోథెరపీ తీసుకున్నా : సంయుక్త

శుక్ర మౌఢ్యమిలో సమంత పెళ్లి చేస్కుంది, ఏమౌతుందని అడుగుతున్నారట

మీ తల్లిదండ్రులను - దేవుడుని ఆరాధించండి : శివకార్తికేయన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments