Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్

Webdunia
ఆదివారం, 3 మే 2020 (09:37 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సెక్యూరిటీ సిబ్బందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సీఎంతో పాటు మిగిలిన సెక్యూరిటీ సిబ్బంది, సీఎం వెంట ఉండే అధికారగణం ఆందోళన చెందుతోంది. 
 
సీఎం ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లోనే ఆయన భద్రతా సిబ్బంది కూడా ఉంటుంది. వీరిలో ముగ్గురికి కరోనా వైరస్ సోకడం ఇపుడు కలకలం రేపుతోంది. ఈ సెక్యూరిటీ సిబ్బంది అంతా ముంబై పోలీసు శాఖ స్థానిక ఆయుధ విభాగానికి చెందినవారు. 
 
ఈ పరిస్థితుల్లో సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో ముగ్గురు కరోనా బారిన పడటంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. జరిగిన ఘటనతో ఇప్పుడున్న భద్రతా  సిబ్బందిని తొలగించి కొత్త సిబ్బందిని నియమించనున్నామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 
 
మరోవైపు, దేశంలో అత్యధిక పాజిటివ్ కేసులు ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 25 శాతానికి పైగా నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. కేంద్రం కూడా ఆందోళన చెందుతోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments