Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరెళుతున్నారా? అయితే ఈ సిస్టంతో మీ ఇంట్లో దొంగతనం జరగదు, ఎలా?

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (15:45 IST)
దొంగలను పట్టుకునేందుకు తిరుపతిలో పోలీసులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనానికి వచ్చే దొంగలను సులువుగా గుర్తించి వారిని పట్టించే సిస్టంను ఉపయోగిస్తున్నారు. దొంగతనం జరక్కుండా అడ్డుకట్ట వేస్తున్నారు. 

 
టెంపుల్ సిటీ తిరుపతిలో ఈమధ్యకాలంలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో అర్బన్ జిల్లా పోలీసులకు ఇదొక సవాల్‌గా మారింది. లాక్డ్ హౌస్ మానిటర్ సిస్టం పేరుతో ఒక కొత్త సిస్టంను అర్బన్ జిల్లా పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. 

 
దీంతో బంధువుల ఇళ్ళకు వెళ్ళే వారు ఈ సిస్టంను ఇంట్లో ఏదో ఒక ప్రాంతంలో ఉంచి వెళితే పోలీసుల పర్యవేక్షణలో ఇది పనిచేస్తూ ఉంటుంది. తిరుపతి నగరంలోని ఎస్బీఐ కాలనీలో నివాసముంటున్న సాయిశంకర్ కుటుంబం బంధువుల ఇంటికి వెళ్ళింది. పోలీసుల సలహాతో ఎల్‌హెచ్‌ఎంఎస్ సిస్టంను ఇంట్లో అమర్చి వెళ్ళారు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగతనానికి వచ్చాడు ఒక దొంగ. 

 
పోలీసుల పర్యవేక్షణలో సిస్టం ఉండటంతో సులువుగా దొంగను గుర్తించారు. వెంటనే స్థానికంగా ఉన్న బ్లూకోర్ట్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. పోలీసుల అలజడి తెలుసుకున్న దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే దొంగ ఫోటో మొత్తం సిస్టంలో నిక్షిప్తమైంది. సులువుగా దొంగను పట్టుకుంటామంటున్నారు అర్బన్ జిల్లా పోలీసులు. ఇంటికి తాళాలు వేసి బయటి ప్రాంతాలకు వెళ్ళాలనుకునేవారు ఎల్‌హెచ్‌ఎంఎస్ సిస్టంను తప్పనిసరిగా వాడాలని పోలీసులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments