Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థుల తలలు పగులగొట్టిన పోలీసులు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (15:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలలను విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో విద్యార్థి సంఘాలు సోమవారం ఆందోళనకు దిగాయి. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల - పాఠశాల విలీన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం నగరంలోని ఎస్‌బిఎన్‌ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. 
 
ప్రభుత్వ చర్యను విద్యార్థులు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకించగా యాజమాన్యం ఇప్పటికే విలీనానికి అంగీకరించి సంబంధిత పత్రాన్ని విద్యాశాఖాధికారులకు సమర్పించినట్లు తెలిసింది. పాఠశాలను ప్రైవేటీకరించిన పక్షంలో ఫీజుల భారం విద్యార్థులపై పడుతుందని విద్యార్థులు ఆందోళనకు దిగారు.
 
విద్యార్థుల ఆందోళనతో ఎస్ఎస్‌బీఎన్ కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కళాశాల వద్ద రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులను తొలగించేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, పోలీసుల మధ్య దాదాపు గంట పాటు తోపులాట జరిగింది.
 
అయితే, అక్కడ పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు ప్రయత్నించిన పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసుల లాఠీచార్జీ జరిపారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని తలకు గాయమైంది. ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళన ఉద్ధృతం చేశారు. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలోనే పోలీసులు విద్యార్థులను చెదరగొట్టి, ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారని విద్యార్థులు ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments