Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖకు కేటీఆర్ వెళతారా..?

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (10:01 IST)
విశాఖ ఉక్కు కార్మికుల ఉద్యమానికి మద్దతు ప్రకటించిన తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విశాఖకు ఎప్పుడు వెళతారన్న చర్చకు మరోసారి తెరలేచింది. తెలంగాణలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల సమయంలో, తాను స్వయంగా విశాఖకు వెళ్లి ఉక్కు ఉద్యమంలో పాల్గొంటానని కేటీఆర్ ప్రకటించారు.

కేసీఆర్‌తో మాట్లాడి, ఆయన అనుమతితో విశాఖకు వెళతానని చెప్పారు. అది హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లోని సీమాంధ్ర గ్రాడ్యుయేట్ ఓటర్లను మెప్పించింది. చివరకు భాజపాను వ్యక్తిగతంగా అభిమానించే వారు సైతం, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను స్వాగతించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సీమాంధ్ర గ్రాడ్యుయేట్లు తెరాస అభ్యర్ధి వాణీదేవికి ఓట్లు వేసి, ద్వితీయ ప్రాధాన్యం కింద బీజేపీకి వేశారు.
 
ఎన్నికల ముందు విశాఖ పర్యటనపై హామీ ఇచ్చిన కేటీఆర్, ఫలితాలు వెలువడి వారం దాటినప్పటికీ మళ్లీ ఆ ప్రస్తావన చేయకపోవడం చర్చనీయాంశమయింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సీమాంధ్ర ఓట్ల కోసమే కేటీఆర్ విశాఖ అంశాన్ని ప్రస్తావించారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

ఎన్నికల తర్వాత మళ్లీ కేటీఆర్ విశాఖ గురించి మాట్లాడరని వారు జోస్యం చెప్పారు. విశాఖ ఉద్యమంపై అంత చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు కేటీఆర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల ముందు ఆంధ్రావారి ఓట్ల కోసం జిమ్మిక్కులు చేయడం టీఆర్‌ఎస్‌కు అలవాటేనని రేవంత్‌రెడ్డి విమర్శించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments