Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి లోక్‌సభ బైపోల్ : ఓటర్లకు సిరా గుర్తు ఎక్కడ వేస్తారంటే?

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (09:58 IST)
తిరుపతి లోక్‌సభ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ (వైకాపా) గత యేడాది కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఇందుకోసం నోటిఫికేషన్ కూడా జారీచేసింది. దీంతో ఆయా పార్టీలు తమతమ అభ్యర్థులను ప్రకటించాయి.
 
అధికార వైకాపా నుంచి సీఎం జగన్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి మాజీ ఎంపీ పనబాక లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నుంచి చింతా మోహన్, బీజేపీ - జనసేన పార్టీ నుంచి డాక్టర్ రత్నప్రభలు తలపడుతున్నారు. 
 
ఈ ఉప ఎన్నిక కోసం ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలో ఓటేసే వారికి అధికారులు ఎడమ చేతి చూపుడు వేలికి బదులు కుడిచేతికి సిరా గుర్తు పెట్టనున్నారు. 
 
ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు వారి ఎడమ చేతికి సిరా గుర్తు పెట్టారు. ఆ గుర్తు ఇంకా చెరిగిపోకపోవడంతో ఉప ఎన్నికలో కుడి చేతికి సిరా గుర్తు పెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలింగ్ సిబ్బందికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments