Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు ప్రభుత్వ పాఠశాలలోకి అడవి ఏనుగులు

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (15:01 IST)
చిత్తూరు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించిన అడవి ఏనుగులు అక్కడున్న సామాగ్రిని ధ్వంసం చేశాయి. అనంతరం విద్యాశాఖ, అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో వ్యక్తిగత తనిఖీలు నిర్వహించారు. 
 
చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మండలం కీరమండ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోకి గురువారం రాత్రి అడవి ఏనుగులు ప్రవేశించి అక్కడున్న వస్తువులను ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు యథావిధిగా పాఠశాలకు వెళ్లారు.
 
ఆ సమయంలో పాఠశాల రిజర్వు గదిలో మధ్యాహ్న భోజనం కోసం ఉంచిన నిత్యావసర వస్తువులు, కిరాణా సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని చూసి అవాక్కయ్యారు. 
 
అలాగే తరగతి గదిలో కిటికీలు, తలుపులు పగులగొట్టి ఉండడంతో ఒక్కసారిగా షాకైన వారు పాఠశాల వెనుకవైపు వెళ్లి చూడగా అక్కడ ఏనుగుల పాదాలు కనిపించాయి. ఈ ఘటనపై అటవీ శాఖా అధికారులకు సమాచారం అందించడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments