Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త ప్లాంట్ ఏర్పాటు: కర్ణాటక ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న టయోటా కిర్లోస్కర్ మోటర్

image
, బుధవారం, 22 నవంబరు 2023 (19:14 IST)
“మేక్ ఇన్ ఇండియా” నిబద్ధతకు కట్టుబడి, “అందరికీ మాస్ హ్యాపీనెస్” తీసుకురావాలనే లక్ష్యంతో, టయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) ఈ రోజు కర్ణాటక ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం(MOU)పై సంతకం చేసింది. తాజా పెట్టుబడుల ద్వారా దేశంలో ప్రస్తుత కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. దాదాపు రూ.3,300 కోట్ల పెట్టుబడులు ఈ ఎంఓయులో భాగంగా పెట్టనున్నారు, ఈ కొత్త ప్లాంట్‌ ఏర్పాటుతో తమ సామర్థ్యాన్ని పెంచుకోవటంతో పాటుగా "అందరికీ మొబిలిటీ"ని సృష్టించడానికి కొత్త సాంకేతికతలను పరిచయం చేయడంతో స్థానిక ఉత్పాదక పర్యావరణ వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుంది. ఇది భారతదేశంలోని కంపెనీ యొక్క మూడవ ప్లాంట్, ఇది కర్ణాటకలోని బెంగుళూరు సమీపంలోని బిదాడిలో ఉంది. 
 
కర్ణాటక ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై ఈరోజు కర్ణాటక రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య, శ్రీ మసకాజు యోషిమురా, మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టయోటా కిర్లోస్కర్ మోటార్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ M. B. పాటిల్, కర్ణాటక ప్రభుత్వ, భారీ-మధ్య తరహా పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మంత్రి , శ్రీ స్వప్నేష్ R. మారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, శ్రీ విక్రమ్ గులాటి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, శ్రీ సుదీప్ శాంత్రమ్ దాల్వి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ & చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్, మరియు టయోటా కిర్లోస్కర్ మోటర్ యొక్క ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ కొత్త ఫీచర్‌... ఇ-మెయిల్ అడ్రెస్‌కు లింక్ చేసే అనుమతి