Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కుర్రాళ్లతో ఏంటి ఇకఇకలు పకపకలు, లింకు పెట్టుకున్నావా అంటూ...

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (22:36 IST)
ప్రేమను జయించాడు. కులాంతర వివాహం చేసుకున్నాడు. పెద్దలను ఎదిరించి వేరు కాపురం పెట్టాడు. ముగ్గురు పిల్లలు పుట్టారు. అయితే అతనిలో అప్పుడే అనుమానం పెనుభూతంగా మారింది. భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని రగిలిపోయాడు. అతి దారుణంగా భార్యను చంపేశాడు.
 
చిత్తూరు జిల్లా కెవిబి పురం మండల కేంద్రంలోని బిసి కాలనీలో నివాసముండే సూరిబాబు, సుహాసినిలకు ముగ్గురు పిల్లలున్నారు. వీరికి పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సూరిబాబు టైలర్. వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. ప్రశాంతంగా సాగిపోయే కుటుంబం.
 
అయితే టైలరింగ్ కోసం వచ్చే కొంతమంది యువకులతో సుహాసిని క్లోజ్‌గా మాట్లాడటం చూశాడు సూరిబాబు. దీంతో భార్యపై ఇంతెత్తున లేచాడు, వాళ్లతో ఏంటి ఇకఇకలు పకపకలు. వారితో లింక్ పెట్టుకున్నావా అంటూ దారుణంగా మాట్లాడాడు. తను మామూలుగా మాట్లాడుతున్నానే తప్ప ఎవరితోను క్లోజ్‌గా లేనని సుహాసిని చెప్పింది. అస్సలు వారితో మాట్లాడవద్దు అంటూ షరతలు పెట్టాడు భర్త. ఇదంతా గత రెండు నెలల నుంచి సాగుతోంది.
 
అయితే ఈరోజు సాయంత్రం ఆ గొడవ కాస్త పెద్దదిగా మారి మాటామాటా పెరిగింది. ఆగ్రహం కట్టలు తెంచుకున్న సూరిబాబు భార్య సుహాసిని తలపై రోకలి బండతో మోది అతి దారుణంగా చంపేసి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments