Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కుర్రాళ్లతో ఏంటి ఇకఇకలు పకపకలు, లింకు పెట్టుకున్నావా అంటూ...

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (22:36 IST)
ప్రేమను జయించాడు. కులాంతర వివాహం చేసుకున్నాడు. పెద్దలను ఎదిరించి వేరు కాపురం పెట్టాడు. ముగ్గురు పిల్లలు పుట్టారు. అయితే అతనిలో అప్పుడే అనుమానం పెనుభూతంగా మారింది. భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని రగిలిపోయాడు. అతి దారుణంగా భార్యను చంపేశాడు.
 
చిత్తూరు జిల్లా కెవిబి పురం మండల కేంద్రంలోని బిసి కాలనీలో నివాసముండే సూరిబాబు, సుహాసినిలకు ముగ్గురు పిల్లలున్నారు. వీరికి పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సూరిబాబు టైలర్. వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. ప్రశాంతంగా సాగిపోయే కుటుంబం.
 
అయితే టైలరింగ్ కోసం వచ్చే కొంతమంది యువకులతో సుహాసిని క్లోజ్‌గా మాట్లాడటం చూశాడు సూరిబాబు. దీంతో భార్యపై ఇంతెత్తున లేచాడు, వాళ్లతో ఏంటి ఇకఇకలు పకపకలు. వారితో లింక్ పెట్టుకున్నావా అంటూ దారుణంగా మాట్లాడాడు. తను మామూలుగా మాట్లాడుతున్నానే తప్ప ఎవరితోను క్లోజ్‌గా లేనని సుహాసిని చెప్పింది. అస్సలు వారితో మాట్లాడవద్దు అంటూ షరతలు పెట్టాడు భర్త. ఇదంతా గత రెండు నెలల నుంచి సాగుతోంది.
 
అయితే ఈరోజు సాయంత్రం ఆ గొడవ కాస్త పెద్దదిగా మారి మాటామాటా పెరిగింది. ఆగ్రహం కట్టలు తెంచుకున్న సూరిబాబు భార్య సుహాసిని తలపై రోకలి బండతో మోది అతి దారుణంగా చంపేసి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments