Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగొచ్చి నానా యాగీ చేస్తున్నాడనీ.... పచ్చడిబండతో దాడి

తెలుగు రాష్ట్రాల్లో భర్తలకు రక్షణ లేకుండా పోయింది. ఈ రాష్ట్రాల్లో భర్తలపై భార్యామణులు దాడులు చేస్తున్నారు. పెక్కు సంఘటనల్లో ఏకంగా భర్తలనే కడతేర్చుతున్నారు.

Webdunia
గురువారం, 31 మే 2018 (08:16 IST)
తెలుగు రాష్ట్రాల్లో భర్తలకు రక్షణ లేకుండా పోయింది. ఈ రాష్ట్రాల్లో భర్తలపై భార్యామణులు దాడులు చేస్తున్నారు. పెక్కు సంఘటనల్లో ఏకంగా భర్తలనే కడతేర్చుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా కంతేరు గ్రామంలో తాగొచ్చిన భర్త రాత్రిపూట నానా యాగీ చేస్తున్నాడనీ ఆగ్రహించిన భార్య... గాఢ నిద్రలో ఉన్న భర్తపై పచ్చడిబండతో దాడి చేసింది. దీంతో అతను తలపగిలి అక్కడే చనిపోయాడు. దీంతో భార్య పారిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కంతేరు గ్రామానికి చెందిన వాకా వెంకటేశ్వర్లు(45), లక్ష్మి అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వెంకటేశ్వర్లు ఆ గ్రామంలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. పచ్చి తాగుబోతు. రాత్రుళ్లు బాగా తాగివచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. మంగళవారం రాత్రి కూడా ఎప్పటిలాగే పీకల వరకు మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. 
 
ఆ తర్వాత భార్యతో గొడవకు దిగాడు. దీంతో వెంకటేశ్వర్లు తండ్రి, సోదరుడు జోక్యం చేసుకొని, గొడవ సద్దుమణిగేలా చేశారు. ఆ తర్వాత వెంకటేశ్వర్లు ఇంటి బయట పడుకొన్నాడు. అతడు మంచి నిద్రలో ఉండగా, వంటగదిలో ఉన్న పచ్చడిబండతో భర్త తలపై బలంగాకొట్టింది. వెంకటేశ్వర్లు పెద్దగా కేకలుపెట్టడంతో చుట్టుపక్కలవారు పరిగెత్తుకొనివచ్చారు. అప్పటికే రక్తపు మడుగులో కొద్దిసేపు తన్నుకొని వెంకటేశ్వర్లు చనిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న లక్ష్మి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments