Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొగుడు వద్దు.. ప్రియుడే ముద్దు : భార్య కిరాతక చర్య

Webdunia
ఆదివారం, 16 డిశెంబరు 2018 (17:25 IST)
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త కంటే... మధ్యలో వచ్చిన ప్రియుడే ముద్దని భావించిన ఓ భార్య అత్యంత కిరాతక చర్యకు పాల్పడింది. కట్టుకున్న భర్త నుదుటిపై గొడ్డలితో నరికి హత్య చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని తొర్రూరులో జరిగిన ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నెల్లికుదురు గ్రామానికి చెందిన జెల్లక వెంకన్నకు కేసముద్రంకు చెందిన సుభద్రతో 18 యేళ్ళ క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ దంపతులు కూలి పనులు చేయించుకుంటూ జీవినం సాగిస్తున్నారు. 
 
ఈ క్రమంలో అమనగల్ ప్రాంతానికి చెందిన లావుడ్యా రామ్ అలియాస్ శీను అనే వ్యక్తి వద్ద వెంకన్న కుటుంబ అవసరాల నిమిత్తం రూ.50 వేలు అప్పు తీసుకున్నాడు. దీంతో వెంకన్న ఇంటికి శీను వస్తూపోతుండేవాడు. 
 
ఈ క్రమంలో సుభద్రతో శీనుకు ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన వెంకన్న వారిద్దరినీ మందలించడమే కాకుండా పంచాయతీ పెద్దలతో కూడా చెప్పించాడు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.
 
ఈ క్రమంలో భర్తను వదిలించుకోవాలని ప్లాన్ వేసిన సుభద్ర... శీను, అతని స్నేహితుడు మంగిలాల్‌తో కలిసి ఈనెల 7వ తేదీన గొడ్డలితో నుదుటిపై మోది చంపేశారు. ఆ తర్వాత ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు ముగ్గురినీ హత్య చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments