Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క యేడాది ఫోన్ వాడకుంటే రూ.72 లక్షల బహుమతి... ఎక్కడ? ఏంటి?

Webdunia
ఆదివారం, 16 డిశెంబరు 2018 (16:30 IST)
ఒక్క యేడాది పాటు ఫోన్ వాడకుండే రూ.72 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని విటమిన్ వాటర్ కంపెనీ ప్రకటించింది. నో ఫోన్ ఫర్ ఏ ఇయర్ పేరిట ఓ పోటీని నిర్వహించనుంది. 
 
కోల్‌కతా కంపెనీ అనుబంధ సంస్థ అయిన విటమిన్ వాటర్ కంపెనీ ఈ పోటీలను నిర్వహిస్తోంది. సాధారణంగా ఇపుడు ఫోన్ లేకుండా ఒక్క క్షణం పాటు కూడా ఉండలేని పరిస్థితి ఉంది. అందుకే ఒక్క యేడాది పాటు ఫోన్ వాడకుండా ఉంటే రూ.72 లక్షల బహుమతి అందజేస్తామని ప్రకటించింది. 
 
ఇందులో పోటీ పడేందుకు విటమిన్‌ వాటర్‌కు చెందిన ట్విట్టర్‌, లేదా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ల ద్వారా జనవరి 8, 2019 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోటీలో పాల్గొనేవారు స్మార్ట్‌ఫోన్‌ లేకుండా సమయాన్ని ఎలా గడుపుతాం? అనే విషయాన్ని సదరు పోటీదారుడు కంపెనీకి వివరించాల్సి ఉంటుంది. 
 
పోటీదారుడు ఇచ్చే సమాధానం నచ్చితే కాంట్రాక్ట్‌ పత్రాలపై సంతకం చేయించుకుంటారు. ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లను ఈ పోటీలో భాగంగా వాడుకునే వెసులుబాటు ఉంది. అయితే పోటీలో పాల్గొని చివరిదాకా కొనసాగలేని వారి కోసం విటమిన్ వాటర్ సంస్థ మరో ఆఫర్ ప్రకటించింది. 
 
కనీసం 6 నెలల పాటు ఫోన్ వాడకపోయినా రూ.7 లక్షలను ఖాతాలో జమ చేస్తామని చెబుతోంది. అన్నట్లు ఇంట్లో వాళ్లు, స్నేహితులతో మాట్లాడేందుకు 1996 నాటి సెల్యూలర్ ఫోన్‌ను కంపెనీ అందివ్వనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments