Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతల అరాచకం... భర్త ఇంటి ముందే రెండో భార్య మృతదేహం పూడ్చివేత

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2023 (08:01 IST)
చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా నేతలు మరోమారు రెచ్చిపోయారు. రెండో భార్య చనిపోతే భర్త ఇంటి ముందే మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. భార్య చనిపోతే కడచూపుకు కూడా రాలేదన్న అక్కసుతో వారు ఈ పనికి పాల్పడ్డారు. అంతటితో వారి ఆగ్రహం చల్లారకపోవడంతో భర్త ఇంటిలో చొరబడి వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ఈ అరాచకం జిల్లాలోని కుప్పం మండలం మల్లానూరు పంచాయతీ సింగారపురంలో ఆదివారం జరిగింది. 
 
తాగాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సింగారపురం గ్రామానికి చెందిన చెన్నయ్యన్‌ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య రత్నమ్మ గత కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె అనారోగ్యంతో శనివారం చనిపోయింది. ఈ విషయాన్ని భర్తకు చేరవేశారు. 
 
అయితే, తన భార్యను కడసారి చూసేందుకు భర్త రాలేదు. దీంతో ఆగ్రహించిన రత్నమ్మ కుటుంబ సభ్యులు స్థానికి ప్రజాప్రతినిధిగా ఉన్న అధికార వైకాపా నేతలను ఆశ్రయించారు. ఆయన అండదండలతో రత్నమ్మ మృతదేహాన్ని తీసుకొచ్చి చెన్నయ్యన్ ఇంటి ముందు పాతిపెట్టారు. ఆ తర్వాత చెన్నయ్యన్ ఇంటిలోని చొరబడి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. ఆ సమయంలో చెన్నయ్యన్ ఇంట్లో లేరు. దీంతో ఆయన న్యాయం కోరుతూ స్థానిక పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ప్రభాస్.... ఎలా?

కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 555 Cr+ వసూళ్లు

భారతీయుడు2 లో క్యాలెండర్ సాంగ్ చేస్తున్న మోడల్ డెమి-లీ టెబో

కల్కి మొదటి వారాంతం హిందీ, ఉత్తర అమెరికా కలెక్టన్ల వివరాలు

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments