Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతల అరాచకం... భర్త ఇంటి ముందే రెండో భార్య మృతదేహం పూడ్చివేత

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2023 (08:01 IST)
చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా నేతలు మరోమారు రెచ్చిపోయారు. రెండో భార్య చనిపోతే భర్త ఇంటి ముందే మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. భార్య చనిపోతే కడచూపుకు కూడా రాలేదన్న అక్కసుతో వారు ఈ పనికి పాల్పడ్డారు. అంతటితో వారి ఆగ్రహం చల్లారకపోవడంతో భర్త ఇంటిలో చొరబడి వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ఈ అరాచకం జిల్లాలోని కుప్పం మండలం మల్లానూరు పంచాయతీ సింగారపురంలో ఆదివారం జరిగింది. 
 
తాగాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సింగారపురం గ్రామానికి చెందిన చెన్నయ్యన్‌ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య రత్నమ్మ గత కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె అనారోగ్యంతో శనివారం చనిపోయింది. ఈ విషయాన్ని భర్తకు చేరవేశారు. 
 
అయితే, తన భార్యను కడసారి చూసేందుకు భర్త రాలేదు. దీంతో ఆగ్రహించిన రత్నమ్మ కుటుంబ సభ్యులు స్థానికి ప్రజాప్రతినిధిగా ఉన్న అధికార వైకాపా నేతలను ఆశ్రయించారు. ఆయన అండదండలతో రత్నమ్మ మృతదేహాన్ని తీసుకొచ్చి చెన్నయ్యన్ ఇంటి ముందు పాతిపెట్టారు. ఆ తర్వాత చెన్నయ్యన్ ఇంటిలోని చొరబడి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. ఆ సమయంలో చెన్నయ్యన్ ఇంట్లో లేరు. దీంతో ఆయన న్యాయం కోరుతూ స్థానిక పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments