Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టిన నాలుగు రోజులకే నలుగురి చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపిన శిశువు... ఎలా? 1

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2023 (07:47 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఓ నవజాత శిశువు మరో నలుగురు చిన్నారులకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. అదీకూడా పుట్టిన నాలుగు రోజులకే అవయవదానం చేసి, దేశంలోనే అత్యంత పిన్న వయసు గల అవయవ దాతగా నిలిచాడు. నాలుగు రోజుల క్రితం జన్మించిన మగ శిశువు నుంచి సేకరించిన అవయవాలను మరో నలుగురు చిన్నారులకు అమర్చి వారికి ప్రాణదానం చేసినట్టు జీవన్ దీప్ అవయవదాన ఫౌండేషన్ తెలిపింది. 
 
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఉండే అనూప్ ఠాకూర్ భార్య వందనకు అక్టోబరు 23వ తేదీ సాయంత్రం ప్రసవం జరిగింది. అయితే, నవజాత శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆ తర్వాత న్యూరో సర్జన్‌కు సిఫార్సు చేశారు. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స అందించగా, బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
దీంతో జీవన్‌దీప్ అవయవదాన  ఫౌండేషన్ ట్రస్టీ విపుల్ తలావియా ఆస్పత్రికి చేరుకుని చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను అవయవదానానికి ఒప్పించారు. ఆ తర్వాత ఫౌండేషన్ సభ్యులు చిన్నారి జన్మించిన సుమారు 100 గంటల తర్వాత అతడి  రెండు కిడ్నీలు, కళ్లు, కాలేయాన్ని సేకరించిన వైద్యులు మరో నలుగురు చిన్నారులకు అమర్చి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments