Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టిన నాలుగు రోజులకే నలుగురి చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపిన శిశువు... ఎలా? 1

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2023 (07:47 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఓ నవజాత శిశువు మరో నలుగురు చిన్నారులకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. అదీకూడా పుట్టిన నాలుగు రోజులకే అవయవదానం చేసి, దేశంలోనే అత్యంత పిన్న వయసు గల అవయవ దాతగా నిలిచాడు. నాలుగు రోజుల క్రితం జన్మించిన మగ శిశువు నుంచి సేకరించిన అవయవాలను మరో నలుగురు చిన్నారులకు అమర్చి వారికి ప్రాణదానం చేసినట్టు జీవన్ దీప్ అవయవదాన ఫౌండేషన్ తెలిపింది. 
 
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఉండే అనూప్ ఠాకూర్ భార్య వందనకు అక్టోబరు 23వ తేదీ సాయంత్రం ప్రసవం జరిగింది. అయితే, నవజాత శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆ తర్వాత న్యూరో సర్జన్‌కు సిఫార్సు చేశారు. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స అందించగా, బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
దీంతో జీవన్‌దీప్ అవయవదాన  ఫౌండేషన్ ట్రస్టీ విపుల్ తలావియా ఆస్పత్రికి చేరుకుని చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను అవయవదానానికి ఒప్పించారు. ఆ తర్వాత ఫౌండేషన్ సభ్యులు చిన్నారి జన్మించిన సుమారు 100 గంటల తర్వాత అతడి  రెండు కిడ్నీలు, కళ్లు, కాలేయాన్ని సేకరించిన వైద్యులు మరో నలుగురు చిన్నారులకు అమర్చి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments