జగన్ హేళనగా మాట్లాడారట... అందుకే గేట్లు మూసేశారట పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి

వై.సి.పి.అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చకుండా చాలామంది ఎమ్మెల్యేలు, నేతలందరూ అధికార పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరగా మరో ఎమ్మెల్యే అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే ఈశ్

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (14:48 IST)
వై.సి.పి.అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చకుండా చాలామంది ఎమ్మెల్యేలు, నేతలందరూ అధికార పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరగా మరో ఎమ్మెల్యే అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి తెలుగుదేశం పార్టీ పుచ్చుకోవడానికి ప్రధాన కారణం తెలిస్తే షాకవుతారు వైసిపి నేతలు. తన నియోజకవర్గంలో ఇన్‌ఛార్జ్‌ల పాలన కొనసాగుతోందని, ఎమ్మెల్యేగా ఉన్న తనను అస్సలు పట్టించుకోవడం లేదని, అధినేత దృష్టికి తీసుకెళ్ళినా ఆయన అంతా సర్దుకుంటుందిలేమ్మా అంటూ పంపించేయడం ఏ మాత్రం ఈశ్వరికి ఇష్టం లేదు.
 
అందులోను అధినేతే తనను చాలా హేళనగా మాట్లాడారంటూ ఎమ్మెల్యే ఈశ్వరి ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. ఎప్పటినుంచో తన అనుచరులతో ఈశ్వరి ఈ విషయాన్ని చెప్పి బాధపడుతోందట. పార్టీ మారాలన్న ఆలోచన ఈశ్వరిలో చాలాకాలంగా వుందట. కానీ తన అనుచరులు సర్దిచెప్పే ప్రయత్నం చేయడంతో వెనక్కి తగ్గింది ఈశ్వరి. అయితే పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ధర్మశ్రీ నుంచి కూడా సరైన విలువ తనకు లేకపోవడం మరింత బాధించిందట. 
 
నిన్న సాయంత్రం నుంచి ఈశ్వరి పార్టీ మారుతారన్న ప్రచారం సాగుతుండటంతో పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వున్న ధర్మశ్రీ ఆమె ఇంటికి వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేసింది. అయితే ఈశ్వరి మాత్రం ధర్మశ్రీతో మాట్లాడటానికి అస్సలు ఒప్పుకోలేదట. వైసిపి నాయకులెవరినీ ఇంటి వద్దకు రావద్దని గేట్లు కూడా మూసేశారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments