Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ముఖ్యమంత్రి పీఠం ఆయనదే.. తేల్చిన ఇండియా టుడే సర్వే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే 2019లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి అధికార టీడీపీ, విపక్ష వైకాపాలు కసరత్తులు చేస్తున్నాయి. ఒకవైపు జగన్ పాదయాత్ర చేస్తుంటే ఇంకోవైపు ఏపీ ముఖ్య

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (10:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే 2019లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి అధికార టీడీపీ, విపక్ష వైకాపాలు కసరత్తులు చేస్తున్నాయి. ఒకవైపు జగన్ పాదయాత్ర చేస్తుంటే ఇంకోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో నిరంతరం ప్రజల చెంతే ఉంటున్నారు.
 
ఈనేపథ్యంలో ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఓ సర్వే నిర్వహించింది. ఏపీ ప్రజలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టనున్నట్లు తేలింది. చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్‌కే ప్రజామద్దతు ఎక్కువగా ఉందని ఈ సర్వే స్పష్టంచేసింది.
 
ఆంధ్రప్రదేశ్ తదుపరి సీఎం ఎవరు? అని అడిగిన ప్రశ్నకు 43 శాతం మంది వైఎస్ జగన్‌కు ఓటేయగా, మరో 38 శాతం మంది సీఎం చంద్రబాబుకు మద్దతు తెలిపారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు 5 శాతం మంది ఓటేశారు. 
 
ఈ నెల 8 నుంచి 12 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 10,650 మంది అభిప్రాయాలను సేకరించి ఈ సర్వేకు తుదిరూపు ఇచ్చారు. ఈ సర్వేలో చంద్రబాబు ప్రభుత్వం పనితీరు బాగుందని 33 శాతం మంది చెప్పగా, బాగోలేదని 36 శాతం మంది స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments