Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ పురాణాల పట్ల మీ పాలసీ ఏంటి? సీఎం జగన్ పైన RRR ప్రశ్నల వర్షం

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (16:34 IST)
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైన ఘటన ఓ కుట్రలా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అంతర్వేది ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారని సీఎం జగన్‌ను, వైసీపీ సర్కారును ప్రశ్నించారు. రథాన్ని ఎవరు తగలబెట్టారో తేల్చాలని డిమాండ్ చేశారు. దీనిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారని నిలదీసారు.
 
సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు వైసీపీ నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రెండు దేవాలయాలకు కలిపి ఒకే ఈవోను నియమిస్తారా, హిందూ దేవాలయాలు అంటే మీకు లెక్కలేదా, మీకు హిందూ పురాణాలు తెలియవు, అసలు మీ పాలసీ ఏంటని ప్రశ్నించారు.
 
ఒక మతం మీద దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు? మీ విధానం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అంతర్వేదిలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసింది. దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పినవాళ్లు మీ మంత్రులకు పిచ్చివాళ్లలా కనబడుతున్నారా? రథం ఘటనపై దేవదాయ శాఖ అధికారులను విచారణ చేయమని చెప్పడం ఏంటని ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments