Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ పురాణాల పట్ల మీ పాలసీ ఏంటి? సీఎం జగన్ పైన RRR ప్రశ్నల వర్షం

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (16:34 IST)
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైన ఘటన ఓ కుట్రలా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అంతర్వేది ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారని సీఎం జగన్‌ను, వైసీపీ సర్కారును ప్రశ్నించారు. రథాన్ని ఎవరు తగలబెట్టారో తేల్చాలని డిమాండ్ చేశారు. దీనిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారని నిలదీసారు.
 
సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు వైసీపీ నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రెండు దేవాలయాలకు కలిపి ఒకే ఈవోను నియమిస్తారా, హిందూ దేవాలయాలు అంటే మీకు లెక్కలేదా, మీకు హిందూ పురాణాలు తెలియవు, అసలు మీ పాలసీ ఏంటని ప్రశ్నించారు.
 
ఒక మతం మీద దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు? మీ విధానం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అంతర్వేదిలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసింది. దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పినవాళ్లు మీ మంత్రులకు పిచ్చివాళ్లలా కనబడుతున్నారా? రథం ఘటనపై దేవదాయ శాఖ అధికారులను విచారణ చేయమని చెప్పడం ఏంటని ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments