Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచినీళ్లుగా భావించి ఫార్మాలిన్ తాగేశాడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (10:16 IST)
వెస్ట్ గోదావరి జిల్లా అత్తిలిలో ఒక విషాద ఘటన సంభవించింది. మంచనీళ్లు అనుకుని ఫార్మాలిన్‌ను ఇద్దరు కూలీలు తాగేశారు. దీంతో వారిద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
జిల్లాలోని అత్తిలి మండలం గుమ్మంపాడుకు చెందిన నడింపల్లి సుబ్బరాజు (51), పాతగొ లుసు రామకృష్ణ (70) రెండేళ్లుగా అత్తిలిలోని ఒక కోళ్లఫారంలో కూలీలుగా పనిచే స్తున్నారు. కొత్తగా కోడి పిల్లలు వస్తున్న సందర్భంగా ఈ నెల 12న ఫారంలో ఫార్మాలిన్ మందును స్ప్రే చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో మంచినీటి డబ్బా పక్కన ఫార్మాలిన్ మందు డబ్బా ఉండటంతో పొరపాటున మంచి నీళ్లనుకుని ఆ మందు కలిపిన నీరు తాగారు. 
 
దీంతో వారిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే అత్తిలిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా రామకృష్ణ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. సుబ్బరాజును మెరుగైన చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆయన కూడా మంగళవారం ఉదయం మృతి చెందాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments