Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచినీళ్లుగా భావించి ఫార్మాలిన్ తాగేశాడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (10:16 IST)
వెస్ట్ గోదావరి జిల్లా అత్తిలిలో ఒక విషాద ఘటన సంభవించింది. మంచనీళ్లు అనుకుని ఫార్మాలిన్‌ను ఇద్దరు కూలీలు తాగేశారు. దీంతో వారిద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
జిల్లాలోని అత్తిలి మండలం గుమ్మంపాడుకు చెందిన నడింపల్లి సుబ్బరాజు (51), పాతగొ లుసు రామకృష్ణ (70) రెండేళ్లుగా అత్తిలిలోని ఒక కోళ్లఫారంలో కూలీలుగా పనిచే స్తున్నారు. కొత్తగా కోడి పిల్లలు వస్తున్న సందర్భంగా ఈ నెల 12న ఫారంలో ఫార్మాలిన్ మందును స్ప్రే చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో మంచినీటి డబ్బా పక్కన ఫార్మాలిన్ మందు డబ్బా ఉండటంతో పొరపాటున మంచి నీళ్లనుకుని ఆ మందు కలిపిన నీరు తాగారు. 
 
దీంతో వారిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే అత్తిలిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా రామకృష్ణ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. సుబ్బరాజును మెరుగైన చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆయన కూడా మంగళవారం ఉదయం మృతి చెందాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments