Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికను తల్లిని చేసిన వృద్దుడు.. 23 యేళ్ల జైలు

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (09:44 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. 13 యేళ్ల మైనర్ బాలికను 76 యేళ్ల వృద్ధుడు తల్లిని చేశాడు. దీంతో ఆయనకు వేలూరు జిల్లా ప్రత్యేక కోర్టు 23 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లాకు చెందిన 76 యేళ్ల అన్వర్ బాషా అనే వ్యక్తి అల్యూమినియం పాత్రల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రాణిపేట జిల్లా కీళవిశారం పిళ్ళయార్ వీధి నివాసి. తన గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు వెళుతూ వ్యాపారం చేసేవాడు. 
 
ఈ క్రమంలో ఓ గ్రామానికి చెందిన 13 యేళ్ల బాలిక బాషాకు పరిచయం కాగా, ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఓ రోజున ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి అత్యాచార పర్వం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆ బాలిక గర్భందాల్చి ఇంటిలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. 
 
దీనిపై బాధిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు బాషాను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ వేలూరు జిల్లా ప్రత్యేక కోర్టులో సాగగా, ముద్దాయిగా తేలిన అన్వర్ బాషాకు బాలికను కిడ్నాప్ చేసినందుకు మూడేళ్లు, ఫోక్సో చట్టం కింద 20 యేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, రూ.10 లక్షల అపరాధం కూడా విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments