Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు వేయాలన్న గ్రామ ప్రజలు... లాఠీలతో చితకబాదిన పోలీసులు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (07:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకునిపోయింది. నిధులు లేకపోవడంతో ఒక్కటంటే ఒక్క రోడ్డును కూడా బాగు చేయలేని దుస్థితి నెలకొంది. అదేసమయంలో అనేక గ్రామాలకు చెందిన ప్రజలు తమకు రోడ్డు వేయాలంటూ కోరుతున్నారు. శాంతియుతంగా ర్యాలీలు చేస్తున్నారు. ఇలాంటి వారిపై అధికార పార్టీ నేతలు, అధికారులు ప్రోద్బలంతో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. 
 
తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం అడవికొలను గ్రామానికి రహదారి నిర్మించాలంటూ గ్రామస్థులు ఆదివారం సాయంత్రం పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను నిడమర్రు పోలీసులు అడ్డుకున్నారు. లాఠీలకు పనిచెప్పి పాదయాత్ర చేస్తున్నవారిని చెదరగొట్టారు. 
 
పలువురిని అరెస్టు చేసి నిడమర్రు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై అడవికొలను గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి రోడ్డు వేయాలని శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే.. పోలీసులు లాఠీలతో చితకబాదడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

Avika Gor: ప్రియుడు మిలింద్ చంద్వానీతో అవికా గోర్ నిశ్చితార్థం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments