Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో మాజీ సైనికుడి బీభత్సం - ఇద్దరి మృతి

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (07:37 IST)
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ మాజీ సైనికుడు తుపాకీతో బీభత్సం సృష్టించాడు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో జిల్లాలోని మాచర్ల ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మాచర్ల మండలం రాయవరంలో మట్టా సాంబశివరావు అనే వ్యక్తి గతంలో ఆర్మీలో పని చేసిన మాజీ సైనికుడు. ఈయన తుపాకీతో బీభత్సం సృష్టించాడు. 
 
ఓ పొలం వివాదంలో సాంబశివ రావుకు, శివ, బాలకృష్ణ తదితరులతో వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణ ముదరడంతో సాంబశివరావు తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. మొత్తం 8 రౌండ్లు కాల్పులు జరపగా, ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో శివ, బాలకృష్ణ సంఘటన స్థలంలోనే కుప్పకూలారు. 
 
వీరిద్దరూ రైతులు. ఈ ఘటనలో ఆంజనేయులు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ప్రస్తుతం మాచర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ సైనికుడు సాంబశివరావును అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments