Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో మాజీ సైనికుడి బీభత్సం - ఇద్దరి మృతి

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (07:37 IST)
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ మాజీ సైనికుడు తుపాకీతో బీభత్సం సృష్టించాడు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో జిల్లాలోని మాచర్ల ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మాచర్ల మండలం రాయవరంలో మట్టా సాంబశివరావు అనే వ్యక్తి గతంలో ఆర్మీలో పని చేసిన మాజీ సైనికుడు. ఈయన తుపాకీతో బీభత్సం సృష్టించాడు. 
 
ఓ పొలం వివాదంలో సాంబశివ రావుకు, శివ, బాలకృష్ణ తదితరులతో వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణ ముదరడంతో సాంబశివరావు తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. మొత్తం 8 రౌండ్లు కాల్పులు జరపగా, ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో శివ, బాలకృష్ణ సంఘటన స్థలంలోనే కుప్పకూలారు. 
 
వీరిద్దరూ రైతులు. ఈ ఘటనలో ఆంజనేయులు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ప్రస్తుతం మాచర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ సైనికుడు సాంబశివరావును అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments