Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెతో సహజీవనం వద్దన్నాడు.. నాటు తుపాకీ తూటాకు బలయ్యాడు

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (08:31 IST)
నీకు పెళ్లై పిల్లలు ఉన్నారు. ఇపుడు నా కుమార్తెతో సహజీవనం చేస్తూ ఆమె జీవితాన్ని నాశనం చేయొద్దు అంటూ ప్రాధేయపడిన ఓ గిరిజనుడుని మరో ఆదివాసి నాటు తుపాకీతో కాల్చిచంపాడు. ఈ దారుణం వెస్ట్ గోదావరి జిల్లా వై.రామవరం మండలం రేగడిపాలెంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రేగడిపాలెం అనే గ్రామానికి చెందిన నరాకోట ఆదిరెడ్డికి పెళ్లీడుకొచ్చిన కుమార్తె ఉంది. ఈమెతో అదే మండలంలోని దూసరపాము గ్రామానికి చెందిన గంగాధరరావు అలియాస్ దొరబాబు సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన ఆదిరెడ్డి.. దొరబాబును హెచ్చరించాడు. తన కుమార్తె జీవితాన్ని నాశనం చేయొద్దంటూ ప్రాధేయపడ్డాడు.
 
పెళ్ళై పిల్లలు ఉన్నవాడివి, తన కుమార్తెను వదిలిపెట్టాలని కోరాడు. ఈ మాటలకు కోపోద్రిక్తుడైన దొరబాబు నాటు తుపాకితో కాల్చి చంపాడు. ఈ విషయంపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో దొరబాబును పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై హత్యా నేరం, నాటు తుపాకిని కలిగి ఉండటం, అట్రాసిటీ కేసులను నమోదు చేశారు. అతని వద్ద నుంచి నాటు తుపాకి, 11 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments