Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తుత్తి ఉరి కాస్త నిజమైంది.. భార్యను బెదిరించబోయిన భర్త మృతి

Webdunia
మంగళవారం, 5 మే 2020 (09:26 IST)
భార్యను బెదిరించబోయిన ఓ భర్త తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వెస్ట్ గోదావరి జిల్లా, తాళ్ళపూడి మండలం, మలకపల్లికి చెందిన జి.గణేష్ (35) అనే వ్యక్తి భార్య ఐదు నెలల క్రితం అంటే జనవరిలో కువైట్‌కు వెళ్లింది. ఆ తర్వాత కరోనా వైరస్ వ్యాపించింది. దీంతో అనేక ప్రభుత్వాలు విదేశీ కార్మికులను తమతమ దేశాలకు తరలి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాయి. కానీ, గణేష్ భార్య మాత్రం అవేమీ పట్టించుకోకుండా అక్కడే ఉండిపోయింది.
 
ఇది భర్తకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తక్షణం తన భార్యను స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేశాడు. ఇందులోభాగంగా, ఆయన భార్యను బెదిరించేందుకు ఉరి నాటకమాడారు. అయితే, ఆ ఉత్తుత్తి ఉరి కాస్త నిజమైంది. మెడకు బిగించుకున్న ఉరి కాస్త ప్రమాదవశాత్తు మెడకు బిగించుకుని ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ మొత్తం ఘటనను ఆయన సెల్‌ఫోనులో చిత్రీకరించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments