Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉయ్ విల్ టేక్ కేర్.. పవన్ ట్వీట్ పై పళని స్పందన

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (17:48 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వినతిపై తమిళనాడు సీఎం పళనిస్వామి సత్వరం స్పందించారు. ఏపీ జాలర్లను జాగ్రత్తగా చూసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఏపీ మత్స్యకారులను ఆదుకోవాలంటూ పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తికి సంబంధించి సంబంధిత శాఖకు దీనిపై ఆదేశాలు జారీ చేస్తామని, వారిని జాగ్రత్తగా చూసుకుంటామని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు.

ఈ వ్యవహారాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సీహెచ్ చొలగండి గ్రామానికి చెందిన సుమారు 30 మంది మత్స్యకారులు చేపల వేట కోసం తమిళనాడు వెళ్లారు. లాక్‌డౌన్ కారణంగా చెన్నై హార్బర్‌ దగ్గర చిక్కుకుపోయారు.

ఈ విషయం తమ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. వారిని ఆదుకోవాలంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామిలను ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. పళనిస్వామికి తమిళంలో ప్రత్యేకంగా మరో ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన పళని..  వారి బాగోగులు చూసుకుంటామని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరోవైపు ఏపీ సీఎంవో నుంచి ఇప్పటి వరకు కనీస స్పందన లేకపోవడంపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments