Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉయ్ విల్ టేక్ కేర్.. పవన్ ట్వీట్ పై పళని స్పందన

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (17:48 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వినతిపై తమిళనాడు సీఎం పళనిస్వామి సత్వరం స్పందించారు. ఏపీ జాలర్లను జాగ్రత్తగా చూసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఏపీ మత్స్యకారులను ఆదుకోవాలంటూ పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తికి సంబంధించి సంబంధిత శాఖకు దీనిపై ఆదేశాలు జారీ చేస్తామని, వారిని జాగ్రత్తగా చూసుకుంటామని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు.

ఈ వ్యవహారాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సీహెచ్ చొలగండి గ్రామానికి చెందిన సుమారు 30 మంది మత్స్యకారులు చేపల వేట కోసం తమిళనాడు వెళ్లారు. లాక్‌డౌన్ కారణంగా చెన్నై హార్బర్‌ దగ్గర చిక్కుకుపోయారు.

ఈ విషయం తమ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. వారిని ఆదుకోవాలంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామిలను ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. పళనిస్వామికి తమిళంలో ప్రత్యేకంగా మరో ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన పళని..  వారి బాగోగులు చూసుకుంటామని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరోవైపు ఏపీ సీఎంవో నుంచి ఇప్పటి వరకు కనీస స్పందన లేకపోవడంపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments