Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో బాలింత మృతి.. స్తన్యమిచ్చి పడుకుంది.. అంతే..

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (09:44 IST)
గుండెపోటుతో మృతి చెందే వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో అధికమవుతోంది. తాజాగా ఓ బాలింత గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. వరంగల్  సీకేఎం ప్రభుత్వాసుపత్రిలో ఘోరం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే, వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామానికి చెందిన సుస్మిత(25) ప్రసవం కోసం ఈ నెల 13న సీకేఎం ఆసుపత్రిలో చేరింది. 16న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 
 
అయితే శిశువుకు అనారోగ్య సమస్యలు రావడంతో వైద్యులు ఆస్పత్రిలోనే నవజాత శిశుసంరక్షణ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎప్పటిలాగే తన బిడ్డకు ప్రత్యేక వార్డులో స్తన్యమిచ్చి వచ్చి తన బెడ్‌పై పడుకుంది. కానీ, ఉదయం చాలాసేపైనా ఆమె చలనం లేకుండా పడుకుని ఉండటంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. సుస్మితను నిద్రలేపేందుకు ప్రయత్నించగా ఆమెలో కదలికలు కనిపించలేదు.  
 
విషయం తెలిసి ఆమెను పరీక్షించిన వైద్యులు సుస్మితకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించినట్లు ధ్రువీకరించారు. ఆమెకు సీపీఆర్ చేసిన ఫలితం లేకపోయింది. సుస్మిత మరణంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నవజాత శిశువును చూస్తూ.. తల్లిని లేని బిడ్డగా మారిపోయావంటూ వారి రోదనలు ఆస్పత్రిలోని వారంతటిని కలిచివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments