చిన్నారి శ్రీహిత రేప్ - అత్యాచారం కేసులో ముద్దాయికి ఉరిశిక్ష

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (13:47 IST)
వరంగల్ జిల్లాలో జరిగిన తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత అత్యాచారం, హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా తేలిన ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, జూన్ 18వ తేదీన హన్మకొండలోని తన ఇంట్లో నిద్రిస్తున్న శ్రీహిత అనే 9 నెలల చిన్నారిని ప్రవీణ్ అనే యువకుడు కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం జరిపి చంపేశాడు. ఈ హత్యపై వరంగల్ పట్టణం ఆగ్రహంతో ఊగిపోయింది. అలాగే, ప్రవీణ్‌కు ఎలాంటి న్యాయం సహాయం చేయరాదని వరంగల్ బార్ కౌన్సిల్ తీర్మానం చేసి, అలాగే నడుచుకుంది. 
 
ఈ క్రమంలో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ప్రవీణ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. ఫలితంగా ఈ కేసు విచారణ కేవలం 48 రోజుల్లో పూర్తి చేశారు. అలాగే, 30 మందికిపైగా సాక్షులను విచారించారు. 
 
అన్నిటికంటే ముఖ్యంగా, నేరం చేసినట్టు ముద్దాయి ప్రవీణ్ జడ్జి జయకుమార్ ఎదుట అంగీకరించాడు. దీంతో ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ మొదటి అదనపు కోర్టు జిడ్జి జయకుమార్ తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments