Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిని విశాఖకు తరలించడం తథ్యం..ఎంపీ విజయసాయిరెడ్డి

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (08:56 IST)
అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించడం తథ్యమని, ఈ ప్రక్రియ త్వరలోనే జరుగుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. త్వరలో ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తామని ఆయన వెల్లడించారు. అయితే నిర్దిష్టమైన సమయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. కొవిడ్‌ నియంత్రణ, విశాఖ నగర పరిధిలోని అభివృద్ధి పనులపై కలెక్టరేట్‌ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ''మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. సీఆర్‌డీఏ కేసులకు, రాజధాని తరలింపునకు సంబంధం లేదు. ముఖ్యమంత్రికి ఎక్కడి నుంచైనా పరిపాలన చేసే హక్కు ఉంది. చంద్రబాబునాయుడు కూడా కొన్నినెలలు హైదరాబాద్‌లో ఉండే రాష్ట్రాన్ని పరిపాలించారు'' అని విజయసాయిరెడ్డి చెప్పారు.
 
విశాఖ నగరం కార్యనిర్వాహక రాజధానిగా మారుతున్న నేపథ్యంలో అభివృద్ధి పనులన్నింటినీ వేగవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ముడసర్లోవ పార్క్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments