Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ లీకేజీ బాధితులకు కొత్త సమస్యలు... కమిలిపోతున్న చర్మం.. శరీరంపై బొబ్బలు...

Webdunia
శనివారం, 9 మే 2020 (10:18 IST)
వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రాణాలతో బయటపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కొత్తగా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. శ్వాసకోశ సమస్యలతో పాటు.. ఇతర సమస్యలు తలెత్తడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా, చర్మం నల్లగా కమిలిపోవడం, చర్మంపై బొబ్బలు వస్తున్నాయి. 
 
రెండు రోజుల వైజాగ్‌లో ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టిరిన్ అనే విషవాయువు లీకై 12 మంది చనిపోగా 554 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు. అయితే, గ్యాస్ పీల్చి అస్వస్థతకులోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ఇప్పుడు ఇతర సమస్యలు చుట్టుముడుతున్నాయి.
 
తాజాగా, బాధితుల్లో కొందరికి ఒంటిపై బొబ్బలు వస్తుండగా, చిన్నారుల్లో జ్వరం, న్యూమోనియా వంటి లక్షణాలు బయటపడుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. తొలుత శరీరంపై దురద, మంట పుడుతున్నాయి. ఆ తర్వాత చర్మం కమిలిపోయి బొబ్బలు వస్తున్నాయి.
 
దీంతో చర్మవ్యాధుల నిపుణులు వారికి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు బాధితులు తాము ఆహారం తీసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. దీంతో స్పందించిన వైద్యులు వారికి కిడ్నీ, కాలేయ పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments