వివేకా హత్య కేసు: సీబీఐ అధికారుల సీన్ రీకన్​స్ట్రక్షన్‌

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (07:59 IST)
మాజీ మంత్రి వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నేడు పులివెందులలోని వివేకా ఇంటిని మరోసారి పరిశీలించి.. సీన్ రీ-కన్​స్ట్రక్షన్ చేశారు. హత్య జరిగిన ముందురోజు రాత్రి దుండగులు ఏ విధంగా ఇంట్లోకి ప్రవేశించి ఉంటారో అధికారులు అంచనా వేశారు.
 
 మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందులలోని వివేకా ఇంటిని సీబీఐ అధికారులు మరోసారి పరిశీలించారు. హత్య జరిగిన ప్రదేశాలైన బెడ్‌రూం, బాత్‌రూంను పరిశీలించారు. 
 
మరోసారి సీన్ రీ-కన్​స్ట్రక్షన్ చేశారు.  ఇంటి పరిసరాల కొలిచి.. వీడియో, ఫొటోలు తీశారు. హత్య జరిగిన ముందురోజు రాత్రి దుండగులు ఏ విధంగా ఇంట్లోకి ప్రవేశించి ఉంటారో అధికారులు అంచనా వేశారు.  ఆరుగురు సీబీఐ అధికారులు టీషర్టులకు పేర్లు రాసి వారి ద్వారా ట్రయల్స్ నిర్వహించారు. 
 
ఇద్దరు దుండగులు పల్సర్‌ బైకుపై వివేకా ఇంటి వద్దకు వచ్చినట్టు.. వారిలో ఒకరు గేటు తీసుకుని నేరుగా ఇంట్లోకి వెళ్లిపోయినట్టు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్​ చేశారు. 
 
మరో ముగ్గురు అధికారులు నిందితుల్లా ట్రయల్స్‌లో పాల్గొనగా.. వారు వివేకా ఇంటి ముందు నుంచి ఒకే బైకులో వెళ్లిపోవడాన్ని సీబీఐ వీడియో తీసింది.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి హత్య జరిగిన రోజు పల్సర్ బైకులోనే వివేకా ఇంటికి వచ్చినట్టు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు తెలిపారు. ఆ నేపథ్యంలోనే వారు ఎలా వచ్చి ఉంటారో ఊహిస్తూ సీబీఐ వీడియో తీసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

తర్వాతి కథనం
Show comments