Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో మాజీ కార్పొరేటర్ విజయారెడ్డిని బాత్‌రూంలో వేసి.. దారుణంగా..

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (19:25 IST)
విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కాయపాలెంలో నివాసముంటున్న మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి హత్యకు గురయ్యారు. ఎన్జీఓఎస్ పద్మభాస్కర అపార్టమెంట్లో ఐదో ఫ్లోర్‌లో ఉంటున్న ఆమె ఇంటి బాత్‌రూంలోనే రక్తపు మడుగులో శవమై కనిపించారు. అయితే అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయడానికని వచ్చినవాళ్లే ఆమెను హత్య చేసి ఉంటారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
 
విజయారెడ్డి ఒంటి మీద నగలు కూడా మాయమైనట్లు ఆమె భర్త ఆరోపిస్తున్నారు. ఆమె కారును కూడా దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. గతంలో విజయా రెడ్డి పక్క ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. అయితే విజయారెడ్డి హత్య నిన్నే జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం తలుపులు పగులకొట్టి చూడగా ఆమె హత్యకు గురైనట్లు తెలుస్తుంది. 
 
సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితుల్ని పట్టుకొనే పనిలోపడ్డారు పోలీసులు. వాచ్‌మ్యాన్ చెప్పిన వివరాలు ప్రకారం నిన్న ఇద్దరు విజయారెడ్డి ఇంటికి వచ్చినట్లుగా సమాచారం. ఆ ఇద్దరు ఎవరు? ఎక్కడివారు అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments