Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వెంకన్న భక్తులకు ఓ శుభవార్త.. రూ.4వేలు చెల్లిస్తే?

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు ఓ శుభవార్త. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చినా శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి ఇక క్యూలైన్లలో వేచి చూసే లక్షలాది మంది భక్తుల కోసం ఏపీ సర్కారు బంపరాఫర్ ఇచ్చింది. ఆంధ్రప్

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (12:32 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు ఓ శుభవార్త. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చినా శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి ఇక క్యూలైన్లలో వేచి చూసే లక్షలాది మంది భక్తుల కోసం ఏపీ సర్కారు బంపరాఫర్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో జూన్ ఆఖరు నుంచి ప్రారంభం కానున్న ఏపీటీడీసీ బస్సు ఎక్కితే, గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే స్వామివారి దర్శనం చేయిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ బస్సును విశాఖపట్నం నుంచి తిరుమలకు నడుపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అత్యాధునికమైన ఈ బస్సును నడిపేందుకు బెంగళూరులో డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. తిరుపతి, విశాఖ డిపోలకు బస్సులను కేటాయిస్తున్నామని వెల్లడించారు. 43 సీట్లుండే ఈ బస్సులో ఎక్కాలంటే ఒక్కొక్కరికీ రూ. 4వేల వరకూ వసూలు చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖలో బయలుదేరే బస్సు మరుసటి రోజు ఉదయం తిరుపతికి వెళుతుంది.
 
తిరుపతిలోనే యాత్రికులకు వసతి సౌకర్యాలు కల్పించి.. అక్కడి నుంచి మరో ఆర్టీసీ బస్సులో తిరుమలకు తీసుకెళ్తారు. ఆపై శ్రీవారి దర్శనం చేయించి కిందకు తీసుకొస్తారని, అదే రోజు మధ్యాహ్నం తిరిగి బయలుదేరే బస్సు శ్రీకాళహస్తిలో దర్శనం తరువాత, మరుసటి రోజు విశాఖ చేరుకుంటుందని ఏపీ సర్కారు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు టీటీడీ అధికారులతో ప్రభుత్వాధికారులు ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments