Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నంలో గిరినాగు.. 12 అడుగుల పొడవు.. పరుగులు పెట్టిన జనం

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (13:55 IST)
Snake
ఏపీలో విశాఖపట్నం జిల్లాలోని మాడుగుల గ్రామంలో గిరినాగు కలకలం రేపింది. కొత్త అమావాస్య సందర్భంగా ప్రజలంతా నూకాలమ్మ కాలనీలో నూకాలమ్మ జాతరలో వుండగా స్థానికంగా ఓ ఇంటి గోడ వెంబడి గిరినాగు ప్రత్యక్షమైంది. 
 
పామును చూసిన వారు.. ఆ దారిలో గుంపులుగా వెళ్తున్న జనం భయంతో పరుగులు తీశారు. వెంటనే తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో చోడవరం ఫారెస్టు రేంజర్‌ రామ్‌ నరేష్‌ బిర్లాంగి మాడుగులకే చెందిన స్నేక్ క్యాచ్చర్ వెంకటేశ్‌తో కలిసి ఘటనా ప్రాంతానికి వచ్చారు. 
 
వెంకటేశ్‌ గిరి నాగును పట్టుకొని తాటిపర్తి పంచాయతీ శివారులోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. గిరి నాగులు చూడటానికి భయంకరంగా ఉంటాయని, కానీ ఎలాంటి హాని చేయవని అటవీ అధికారులు తెలిపారు. ఈ గిరి నాగును కర్రలతో దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా అలాంటి పాము జాతులను కనుగొంటే, వారు వెంటనే అటవీ అధికారులకు తెలియజేయాలి. ఈ పాము 12 అడుగుల పొడవు వుందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments