Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరి మ‌హిళ‌లే టార్గెట్ .... చైన్ స్నాచ‌ర్ల అరెస్ట్!

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (20:27 IST)
చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల‌ను బెజ‌వాడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రూ.4,22,000/- విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో విజయవాడ నగరంలో ఒంటరిగా వెళుతున్నమహిళలను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయి. 
 
 
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు నేరాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. చైన్ స్నాచింగ్ చేసే నిందితులను పట్టుకోవడానికి ఈస్ట్ జోన్ డి.సి.పి. హర్షవర్థన్ రాజు  పర్యవేక్షణలో ఈస్ట్ డివిజన్ ఎ.సి.పి.విజయ పాల్, గన్నవరం ఇన్స్పెక్టర్ శివాజి సిబ్బందితో రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలలో పాల్గొన్నారు. గ‌న్నవరం సెయింట్ జోన్స్ స్కూల్ వద్ద ఇద్దరు వ్యక్తులు సుజికీ యాక్సిస్ బండిపై అనుమానస్పదంగా తిరుగుతుండగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. 

 
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలానికి చెందిన షేక్ నాగుల్ మీరా (24), పోలే రత్న రాజు (20) ఇద్ద‌రినీ అరెస్ట్ చేశారు. వీరిద్ద‌రు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న లేడీస్ నుండి చైన్ స్నాచింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరు కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో స్నాచింగ్లు చేయాలని నిర్ణ‌యించుకున్నారు. సుజికీ యాక్సిస్ బండిపై మొదటగా గత సంవత్సరం నవంబర్ నెలలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఆర్.టి.సి బస్టాండ్ సమీపంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోని 24 గ్రాముల గొలుసును లాక్కొని పారిపోయారు.


తరువాత అదే రోజు గన్నవరం సెయింట్ జోన్స్ స్కూల్ వద్ద నడుచుకుంటూ వెళుతున్న మహిళ నుండి 48 గ్రాముల బంగారపు గోలుసును స్నాచింగ్  చేశారు. నాలుగు రోజుల తరువాత గన్నవరం కేసరపల్లి మెయిన్ రోడ్డు సమీపంలో ఒంటరిగా వెళుతున్న మహిళ వద్ద నుండి సుమారు 12 గ్రాముల బంగారు గొలుసు కొట్టేశారు. డిసెంబరు నెలలో భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ సెంటర్ సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న మహిళ వద్ద నుండి 40 గ్రాముల బంగారపు గొలుసును స్నాచింగ్ చేసి పారిపోయారు. 
 
 
గన్నవరం శ్రీనగర్ కాలనీలో 32 గ్రాములు బంగారపు గొలుసు స్నాచింగ్, ప‌టమట పోస్టల్ కాలనీలో 32 గ్రాములు బంగారపు గొలుసు స్నాచింగ్ చేశారు. నిందితులు గత రెండు నెలల కాలంలో మొత్తం విజయవాడ నగరం,  కృష్ణా జిల్లాలలో కలిపి ఆరు నేరాలను చేసి ఆ చోరి సొత్తును ఈ జ‌న‌వ‌రి 9న అమ్ముకుని జాల్సలు చేద్దామనే ఉద్దేశంతో అమ్మ‌కానికి బ‌య‌లుదేరారు. 
 
 
గన్నవరం సెయింట్ జోన్స్ స్కూల్ వద్ద ఇద్దరు వ్యక్తులు సుజికీ యాక్సిస్ బండిపై వెళుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, నిందితులు ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న మహిళలను టార్గెట్ చేసుకుని చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. నిందితుల వద్ద నుండి చోరీ సొత్తు సుమారు రూ.4,22,000/- విలువైన 188 గ్రాముల బంగారం, నేరాలు చేయడానికి ఉపయోగించే బండిని స్వాధీనం చేసుకున్నారు. 

 
నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్ డివిజన్ ఎ.సి.పి. విజయ పాల్, గన్నవరం ఇన్స్పెక్టర్ కె.శివాజి, క్రైమ్ ఎస్.ఐ. ఫ్రాన్సిస్,  వారి సిబ్బందిని నగర పోలీస్ కమీషనర్ అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments