Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వం కరువైంది... నా కుమార్తె కారుణ్య మరణానికి అనుమతివ్వండి...

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (20:42 IST)
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మానవత్వంకరువైంది. గర్భకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్యం చేసేందుకు మహిళా వైద్యురాలు ససేమిరా అంటోందని, అందువల్ల తన కుమార్తె కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ ఓ తల్లి ప్రాధేయపడుతుంది. ఇదే అంశంపై ఆమె రాష్ట్ర గవర్నర్‌కు ఓ లేఖ రాసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడకు చెందిన స్వర్ణలత అనే మహిళ కుమార్తె జాహ్నవి. ఈమెకు చిన్న వయసులోనే గైనిక్ సంబంధింత సమస్యలు తలెత్తాయి. పైగా, గత 15 యేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతూవస్తోంది. 
 
ఈ నేపథ్యంలో వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని గైనిక్ విభాగంలో ఆమెను చేర్చారు. అయితే, జాహ్నవికి వైద్యం చేసేందుకు మహిళా వైద్యురాలు నిరాకరించారని, కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చినా వైద్యురాలు పట్టించుకోలేదని స్వర్ణలత ఆరోపించారు. 
 
తన కుమార్తె ఉన్న దుస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నానని, అందువల్ల ఆమె కారుణ్య మరణానికి అనుమతించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. తన కూతురుకి వైద్యం అందిస్తారా? లేక కారుణ్య మరణానికి అనుమతిస్తారా? అంటూ ప్రశ్నిస్తూ స్వర్ణలత కన్నీటి పర్యంతమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments