Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య‌వాడ రాజీవ్ గాంధీ పార్క్ ఆధునీకరణ పనుల ప్రారంభం

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (20:25 IST)
విజ‌య‌వాడ‌లోని ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన రాజీవ్ గాంధీ పార్కులో చేపట్టిన ఆధునీకరణ పనుల పురోగతిని బుధవారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులతో కలసి పర్యవేక్షించారు. పార్క్ ఆవరణలో జరుగుతున్న పనుల వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. సత్వరమే సందర్శకులకు అందుబాటులో ఉండేలా పార్క్ లో జరుగుతున్న ఇంజనీరింగ్, గ్రీనరీ ఆధునీకరణ పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

 
పార్క్ లో పిల్లల ఆట పరికరాల ఏర్పాటు పనులు పరిశీలిస్తూ, ఇంకా చేపట్టవలసిన పనులను వెనువెంటనే చేయాల‌న్నారు. పార్క్ ఆవరణలో సందర్శకులకు అందుబాటులో ఉండేలా మరుగుదొడ్లు,   త్రాగునీటి సౌకర్యం కల్పనపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. 

 
అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభ కార్యక్రమానికి  సంబంధించిన ఏర్పాట్లును జిల్లా కలెక్టర్, కమిషనర్ అధికారులతో కలసి పరిశీలించారు. పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.గీతాభాయి, అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ హార్టికల్చర్ బి.దయాకర్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments