కంట్రోల్ నుంచి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేశ్

ఠాగూర్
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (12:43 IST)
నీట మునిగిన విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందుకోసం విజయవాడ కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇక్కడ నుంచే అన్ని రకాల సహాయ చర్యలను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, ఏపీ విద్యా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యవేక్షణలో విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
 
మంగళవారం సహాయక చర్యల్లో ఆరు హెలికాప్టర్లు ద్వారా ఆహారం, త్రాగునీరు సరఫరా చేస్తున్నారు. బోట్లు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా చేసేలా చూడాలని అధికారులను ఆయన కోరారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ విజ్ఞప్తి మేరకు జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీకి ప్రత్యేక హెలికాప్టర్‌లో 2,500 ఆహార పొట్లాలు చేరవేశారు. 
 
విజయవాడ పరిధిలో వరద ముంపుకు గురైన 32 వార్డుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి లోకేష్ పిలుపు మేరకు సహాయ చర్యల్లో రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడకు పార్టీ శ్రేణులు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అలాగే, విజయవాడ డివిజన్ పరిధిలో 70 పునరావాస కేంద్రాల్లో 14,452 మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించారు. మరోవైపు, ప్రకాశం బ్యారేజి వద్ద వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గిపోతుంది. ప్రస్తుత వరద ప్రవాహం 8,71,776 క్యూసెక్కులుగా ఉంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments