Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటలో రాజు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి వెళ్ళాలి : విజయసాయి ట్వీట్

ఠాగూర్
ఆదివారం, 16 మార్చి 2025 (12:59 IST)
వైకాపా మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోమారు ఆసక్తికర ట్వీట్ చేశారు. కోటరీ అనే అంశంపై ఆయన తన ఎక్స్ వేదికలో చేసిన ట్వీట్‌పై ఇపుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారంటూ రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. విజయసాయి చేసిన ట్వీట్‌‍లో... 
 
"పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేందంటే... ఆహా రాజా.. ఓహో రాజా అంటూ ప్రశంసలతో రాజు కళ్లకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దానివల్ల రాజు పోయేవాడు. రాజ్యం కూడా పోయింది.
 
మహారాజు తెలివైనవాడైతే కోటరీ కుట్రల్ని గమనించి, మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతుందో తనకు తానుగా తెలుసుకునేవాడు. తర్వాత వారిమీద (కోటరీ) వేటు వేసి రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి. ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు. కోటా మిగలదు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే" అంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments