Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం నుంచి టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

ఠాగూర్
ఆదివారం, 16 మార్చి 2025 (12:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటలు వరకు పరీక్ష జరుగనుంది. పదహారు రోజుల పాటు జరుగనున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,49,275 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 3,450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఏపీ విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్టు వారు పేర్కొన్నారు. 
 
ఎండలు విపరీతంగా పెరిగిపోవడంతో పరీక్షా కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థును పరీక్షా కేంద్రాలకు చేర్చేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, పదో తరగతి హాల్ టిక్కెట్ చూపించి ఏ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు కూడా పదో తరగతి విద్యార్థుల కోసం రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments