Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం నుంచి టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

ఠాగూర్
ఆదివారం, 16 మార్చి 2025 (12:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటలు వరకు పరీక్ష జరుగనుంది. పదహారు రోజుల పాటు జరుగనున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,49,275 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 3,450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఏపీ విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్టు వారు పేర్కొన్నారు. 
 
ఎండలు విపరీతంగా పెరిగిపోవడంతో పరీక్షా కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థును పరీక్షా కేంద్రాలకు చేర్చేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, పదో తరగతి హాల్ టిక్కెట్ చూపించి ఏ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు కూడా పదో తరగతి విద్యార్థుల కోసం రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

కన్నప్ప గ్రామం ఊటుకూరు శివాలయాలో పూజలు చేసిన విష్ణు మంచు

Vikram: ఫ్యామిలీ మ్యాన్, రివెంజ్ పర్శన్ గా విక్రమ్ నటించిన వీర ధీర సూర టీజర్

Samantha : సమంత నిర్మాణ సంస్థ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ లో శుభం చిత్రం

వారి దగ్గరే ఎదిగాను. వారే సినిమా రిలీజ్ చేయడం ఎమోషనల్ గా ఉంది : సప్తగిరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments