Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి

సెల్వి
శనివారం, 2 మార్చి 2024 (10:11 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల అభ్యర్థుల 9వ జాబితాను విడుదల చేసింది. తాజాగా వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ప్రకటించింది. విజయసాయిరెడ్డి ఇప్పటివరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 
 
నెల్లూరు లోక్‌సభ పార్లమెంటరీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా తనను నియమించినందుకు వైఎస్‌ జగన్‌కు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

"నెల్లూరు లోక్‌సభ పార్లమెంటరీ నియోజకవర్గానికి నన్ను సమన్వయకర్తగా నియమించినందుకు గౌరవనీయులైన సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్‌ జగన్‌గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎప్పటిలాగే పార్టీ కోసం నిబద్ధత, అంకితభావంతో పని చేస్తాను" అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 
 
ఇకపోతే.. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్‌ను ప్రకటించారు. ఇంతియాజ్ వైకాపాలో చేరారు. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మురుగుడు లావణ్యను వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా గంజి చిరంజీవి స్థానంలో మురుగు లావణ్య నియమితులయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments