Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేత విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి.. ఏంటదో తెలుసా?

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (13:35 IST)
vijayasai reddy
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి లభించింది. వైకాపాకు రాజ్యసభలో బలం పెరగడంతో.. కీలకమైన బీఏసీలో చోటు లభించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది వైసీపీ. దీంతో సభలో బిజినెస్‌ అడ్వైజరీ కమిటీలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. 
 
రాజ్యసభ కార్యక్రమాల నిర్వహణలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ కీలకపాత్ర పోషిస్తుంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో.. వైసీపీ నుంచి కొత్తగా నలుగురు సభ్యులు ఎన్నికయ్యారు. దీంతో.. రాజ్యసభలో వైసీపీ బలం రెండు నుంచి ఆరుకు పెరిగింది. ప్రస్తుతం.. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.
 
బీసీఏ సభ్యులుగా ప్రొఫెసర్‌ మనోజ్‌ కుమార్‌ ఝా, మల్లికార్జున్‌ ఖర్గే, శివ్‌ ప్రతాప్‌ శుక్లాలను నామినేట్ చేశారు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు. ఇక, సబార్డినేట్‌ లెజిస్లేచర్‌ కమిటీ సభ్యులుగా జీవీఎల్‌ నరసింహారావు, కె.ఆర్‌.సురేష్‌రెడ్డి నియమితులయ్యారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments