Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతిగా కాదు.. ఉషాపతిగానే వచ్చా.. పిచ్చిరాతలు వద్దు (వీడియో)

భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన నెల్లూరు జిల్లాకు చెందిన ముప్పవరపు వెంకయ్య నాయుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తొలిసారి వచ్చారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం శ్రీవారిని

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (16:01 IST)
భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన నెల్లూరు జిల్లాకు చెందిన ముప్పవరపు వెంకయ్య నాయుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తొలిసారి వచ్చారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 
 
బుధవారం రాత్రే తిరుమలకు చేరుకున్న ఆయన ముందుగా ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి పుష్కరిణకి చేరుకుని పవిత్ర జలాలను ప్రోక్షణం చేసుకున్నారు. అనంతంర శ్రీవరాహస్వామివారి దర్శించుకుని వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. సామాన్య భక్తులతోపాటు క్యూలైన్‌లో స్వామివారి ఆలయానికి వచ్చిన వెంకయ్య, ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ అధికారుల ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికారు. 
 
శ్రీవారి దర్శనం అనంతరం అద్దాల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తర్వాత టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఏఈఓ శ్రీనివాసరాజులు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. వెంకయ్య నాయుడి వెంట ఏపీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న కూడా ఉన్నారు.
 
దర్శనానంతరం వెంకయ్య మాట్లాడుతూ, దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. మరింత పట్టుదలతో కర్తవ్య నిర్వహణ చేయాలని భగవంతుడిని ప్రార్థించినట్టు చెప్పారు. మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో నవ్యక్రాంతిని తీసుకురావాలి... మరింత శక్తిమంతమైన దేశంగా భారత్ ఎదగాలని ఆకాక్షించినట్టు చెప్పారు. 
 
కాగా, భారత ఉపరాష్ట్రపతికి ఆలయ మహద్వార ప్రవేశం ఉన్నప్పటికీ సామాన్య భక్తులి మాదిరిగా లోనికి ప్రవేశించారు. దీనిపై కూడా వెంకయ్య నాయుడు వివరణ ఇచ్చారు. శ్రీవారి దర్శనానికి తాను ఒక్కడినే రాలేదనీ, కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చాననీ, అందువల్లే సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ విషయంపై రాద్దాంతం చేయొద్దనీ మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. వెంకయ్య శ్రీవారి దర్శన వీడియో చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Shankar: అవతార్ లాగా తన కలల ప్రాజెక్ట్ వేల్పారి చేయబోతున్న తమిళ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments