Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ కాకర్ల మృతిపై ఉపరాష్ట్రపతి సంతాపం

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (14:58 IST)
ప్రముఖ వైద్యులు డా. కాకర్ల సుబ్బారావు పరమపదించారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నట్టు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యరంగానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయం. సేవానిరతితో వృత్తికే జీవితాన్ని అంకితం చేసిన ఆయన, వైద్యులందరికీ ఆదర్శప్రాయులు.
 
రేడియాలజిస్టుగా, ఉస్మానియా వైద్యకళాశాల అధ్యాపకుడిగా, నిమ్స్ ఆసుపత్రి సంచాలకులుగా పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు వారు విశేష కృషి చేశారు. డా. కాకర్ల సుబ్బారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

ప్రముఖ వైద్యులు పద్మశ్రీ కాకర్ల సుబ్బారావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తెలిపారు. 5 దశాబ్దాలకు పైగా ప్రజలకు వైద్య సేవలను అందించి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. రేడియాలజిస్టుగా, నిమ్స్ డైరెక్టరుగా ప్రజలకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. 
 
హైదరాబాద్‌లోని నిమ్స్ అభివృద్ధికి విశేషమైన కృషి చేశారన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి నేటి యువతకు కాకర్ల సుబ్బారావు ఆదర్శంగా నిలిచారన్నారు. సుబ్బారావు రాసిన పరిశోధనా వ్యాసాలకు, పుస్తకాలకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభించాయన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments