Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాలన మహిళలకు స్వర్ణయుగమా? గుడ్ బుక్ పేరుతో మోసానికి శ్రీకారం : వాసిరెడ్డి పద్మ (Video)

ఠాగూర్
బుధవారం, 23 అక్టోబరు 2024 (15:11 IST)
తాను ఏపీ రాష్ట్ర మహిళా సంఘం చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో అనేక విషయాలు జరిగాయని, వాటిపై నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తాను మహిళా చైర్ పర్సన్‌గా ఉండగా, అనేక విషయాలు నాడు ప్రభుత్వం ముందు పెట్టినా పట్టించుకోలేదని వాపోయారు. మహిళల విషయంలో ఇప్పుడు జగన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని, జగన్ రెడ్డి పాలన ఏమైనా మహిళలకు స్వర్ణయుగమా? రోజుకో వికృతమైన ఘటన నాడు మహిళలపై జరిగినా, ఏ నాడు జగన్ రెడ్డి బయటకు రాలేదు, ఒక్క పరామర్శ చేయలేదు. 
 
ఆ రోజు హోంమంత్రి స్పందించేది కాదు. చాలా విషయాలు నాడు తొక్కి పెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు మాత్రం రాజకీయం చేయటానికి రోడ్లపైకి వస్తున్నారని, నీకు రాజకీయం చేయటానికి మహిళలే దొరికారా అంటూ ఆమె మండిపడ్డారు. జగన్ రెడ్డికి బాధ్యత లేదని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని మోసం చేశారనీ, ఇప్పుడు అధికారం పోయాక మరోసారి గుడ్‌‍బుక్ పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వైసీపీని వ్యాపార సంస్థలా నడిపారంటూ ధ్వజమెత్తారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments