తొక్కిసలాట మృతులకు ఉయ్యూరు ట్రస్ట్ రూ.20 లక్షల సాయం

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (08:50 IST)
గుంటూరులో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ నిర్వహించిన చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రమాదేవి అనే మహిళ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, రాజ్యలక్ష్మి, సయ్యద్ అసిమా అనే మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఈ నేపథ్యంలో ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస రావు స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి వైద్య ఖర్చులు కూడా తామే భరిస్తామని తెలిపారు. 
 
మరోవైపు, ఈ తొక్కిసలాట ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించడం కలచివేసిందని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. తొక్కిసలటా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. 
 
మరోవైపు, రాష్ట్ర ఆరోగ్య మంత్రి విడుదల రజని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలక నుంచి వివరాలు తెలుసుకున్నారు. వైకాపా ఎమ్మెల్యే ముస్తాఫా, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కూడా బాధితులను పరామర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments