స్కూలు బాలికపై తండ్రి స్నేహితుల అఘాయిత్యం

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (13:22 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. స్కూలుకు వెళుతున్న ఓ బాలికపై ఆ బాలిక తండ్రి స్నేహితులే అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలికను కిడ్నాప్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలోని హాపూర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, ఎప్పటిలాగే సోమవారం స్కూలుకు బయలుదేరింది. అయితే, బాలికను ఆమె తండ్రి స్నేహితులు ముగ్గురు అడ్డుకుని కిడ్నాప్ చేశారు. బలవంతంగా ఆమెను బైక్ ఎక్కించుకుని ఓ హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక కామాంధులను ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా, చంపేస్తామని బెదిరించారు. 
 
పైగా, సామూహిక అత్యాచారానికి వీడియో తీశారు. ఈ విషయాన్ని బయటకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని హెచ్చరించారు. అయితే, ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తండ్రికి చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments