Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా ఎక్స్‌ప్రెస్ రద్దు... రైల్వే అధికారుల వెల్లడి

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (13:11 IST)
సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఆదిలాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు చేశారు. ఈ విషయాన్ని విజయవాడ డివిజన్ అధికారులు వెల్లడించారు. గత రెండు వారాల్లో ఈ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అలాగే, మరో మూడు ప్యాసింజర్ రైళ్ళను కూడా ఈ నెల 15వ తేదీ వరకు రద్దు చేశారు. 
 
సికింద్రాబాద్ డివిజన్‌లో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నెల 10, 11 తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి నగదును తిరిగి చెల్లిస్తామని తెలిపారు. మరోవైపు, కాజీపేట - డోర్నకల్ మధ్య నడిచే డోర్నకల్ ప్యాసింజర్, సికింద్రాబాద్ - వరంగల్ మధ్య నడిచే పుష్‌పుల్, కాజీపేట - బల్లార్షా మధ్య నడిచే బల్లార్షా ఎక్స్‌ప్రెస్ రైళ్ళను కూడా ఈ నెల 15వ తేదీ వరకు రద్దు చేసినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments