Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకం రథ చక్రాలకు నిప్పుపెట్టిన దుండగులు

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (12:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలకు, వాటి రథాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. గత రెండున్నరేళ్ళ కాలంలోనే వందల సంఖ్యలో హిందూ ఆలయాలు ధ్వంసానికి గురయ్యాయి. 
 
తాజాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం ఆలయంల మరో దారుణం జరిగింది. ఈ ఆలయంలో పాత రథ చక్రాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో రథ చక్రాలు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
ఆలయ గోశాల పక్కన ఉంచిన ఈ రథ చక్రాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదం సమాచారం తెలుసుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే, ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేశారా లేదా ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా చేశారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments