Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకం రథ చక్రాలకు నిప్పుపెట్టిన దుండగులు

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (12:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలకు, వాటి రథాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. గత రెండున్నరేళ్ళ కాలంలోనే వందల సంఖ్యలో హిందూ ఆలయాలు ధ్వంసానికి గురయ్యాయి. 
 
తాజాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం ఆలయంల మరో దారుణం జరిగింది. ఈ ఆలయంలో పాత రథ చక్రాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో రథ చక్రాలు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
ఆలయ గోశాల పక్కన ఉంచిన ఈ రథ చక్రాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదం సమాచారం తెలుసుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే, ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేశారా లేదా ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా చేశారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments