Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు నాది.. నిధులు రిలీజ్ చేసిన కేంద్రం

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (20:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా, విశాఖపట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. ఇందులోభాగంగా, విశాఖపట్టణంలో రైల్వే భవనాల నిర్మాణం కోసం కేంద్రం నిధులను విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం రూ.103 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
 
విశాఖ రైల్వే స్టేషన్ జోన్ భవనాల నిర్మాణం కోసం ఈ నిధులను ఉపయోగిస్తారు. పాత వైర్‌లెస్ కాలనీలో జోన్ కోసం 13 ఎకరాలను భూసేకరణ చేపట్టారు. ఈ భూముల్లో 8 ఎకరాల్లో జోన్ భవాలను, మల్టీ స్టోరీ బిల్డింగుల రూపంలో నిర్మిస్తారు. అలాగే, విశాఖ రైల్వే స్టేషన్ ఆధునకీకరణ పనుల కోసం రూ.456 కోట్లను కూడా కేంద్రం విడుదల చేసింది. 
 
కేంద్రం విడుదల చేసిన తాజా ప్రకటనతో విశాఖ రైల్వే స్టేషన్ రోడ్డులో రూ.106 కోట్ల నిధులతో కొత్త రైల్వే జోన్‌కు చెందిన భవనాలను నిర్మించనున్నట్టు కేంద్రం తెలిపింది. తొలి దశలో భాగంగా, పాత వైర్‌లెస్ కాలనీలో 13 ఎకరాల్లో నూత రైల్వే జోన్ కోసం కేంద్రం సేకరించింది. ఇందులో 8 ఎకరాల్లో భవనాలను నిర్మిస్తుంది. అలాగే, విశాఖ రైల్వే స్టేషన్ ఆధునకీకరణలో భాగంగా అదనంగా మరో రెండు ఫ్లాట్‌పారాలను నిర్మిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments